రమ్యకృష్ణ ఎన్టీఆర్తో చెయ్యను అనేసిందా...?
టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు అనగానే నరసింహ నుంచి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆమె ప్రతీ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు ఆమె నటన పరంగా చాలా వరకు నచ్చుతూ ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె రేంజ్ బాగా పెరిగింది అనేది వాస్తవం. ఆమె నటనకు ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాహుబలిలో శివగామి దేవిగా రమ్యకృష్ణ విరోచిత నటనకు ప్రపంచ సిని మా అభిమానులు అందరూ జేజేలు కొట్టారు.
అసలు ఆ పాత్రకు ఆమె తప్పా మరొకరిని ఊహించుకునే పరిస్థితి లేనట్టుగా ఆమె విశ్వరూపం చూపించారు. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణ కు తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినా ఆమె తమిళ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు గానూ ఆమెను ఎంపిక చేశారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆమె అందుకు ఓకే చెప్పలేదు అని సమాచార౦. ఎన్టీఆర్ తో నా అల్లుడు అనే సినిమా చేశా అని ఆ తర్వాత తన కెరీర్ ఇబ్బంది పడింది అని ఆమె పేర్కొందట.
ముళ్లపూడి వర దర్శకత్వం వహించిన ఆ సినిమా సరిగా ఆడలేదు కూడా..! మంచి పాత్ర ఇవ్వాలని త్రివిక్రమ్ చూసినా సరే ఆమె మాత్రం అందుకు ఓకే చెప్పలేదు అని సమాచారం. ఆమె పాత్ర సినిమాలో చాలా వరకు కీలకంగా ఉంటుంది అని, ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పినా సరే ఆమె ముందుకు రాలేదు అని అంటున్నారు. నా అల్లుడు సినిమా ఆమెకు అతి పెద్ద ఫ్లాప్ అని, ఎన్టీఆర్ తో సినిమా తనకు అంత కలిసి రాదని స్పష్టంగా చెప్పెసినట్టు తెలుస్తుంది.