ఆ నలుగురితో కొత్త ప్రోగ్రాం చేస్తున్న యాంకర్... అదేంటో తెలుసా...
లాక్ డౌన్ కారణంగా కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిమిషం నిమిషం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుకున్నారు..అందుకే లాక్ డౌన్ ను కూడా మరింత కట్టుడిడ్డంగా ఏర్పాటు చేశారు.. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
ఇకపోతే పేద ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. అందుకే ప్రజల ఆకలి చావులు కొంతవరకైనా తీరుతున్నాయి .... ఇక సినీ తారలు కూడా అదే అదనుగా ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసింద... సోషల్ మీడియా లో రోజుకో విధంగా వీడియోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు...
తాజాగా ప్రముఖ యాంకర్ సుమ.. తాజాగా ఓ సరికొత్త గేమ్ షోతో ప్రేక్షకులను అలరించారు. ఫన్తోపాటు విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఈ గేమ్ షోలో.. సహచర యాంకర్స్ అనసూయ, రష్మి, రవి, ప్రదీప్ పాల్గొన్నారు. వీరంతా వారి వారి ఇళ్ల నుంచే ఈ గేమ్షోలో పాల్గొని ఆకట్టుకున్నారు. ‘సూపర్4 గేమ్ షో’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన వారందరూ ఏం చేస్తున్నారనే విషయాన్ని చాలా సరదాగా చూపించారు..
లాక్డౌన్లో కూడా నా స్నేహితులు అనసూయ, రవి, ప్రదీప్, రష్మి అందించిన సపోర్ట్ వల్లే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ వీడియో రూపొందించగలిగాను. ఫన్ను అందించడంతోపాటు విరాళాల సేకరణ కోసం మేము ఈ వీడియోను రూపొందించాం. ఈ వీడియో ద్వారా సమకూరే ఆదాయాన్ని మన తెలుగు టీవీ పరిశ్రమకు చెందిన వారికి మా వంతు సాయంగా అందిస్తాం.. అంటూ సుమా వెల్లడించింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..మీరే చూడండి...