రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన 21వ చిత్రం చేయనున్నాడని తెలిసిందే. ఇక బాహుబలి నుండి ప్రభాస్ నటిస్తున్న సినిమా ల బడ్జెట్ లు మినిమం 100 కోట్లు దాటుతుంది. ఈ సినిమా కు కూడా భారీ బడ్జెట్ ను ఫిక్స్ చేశారట. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ 21.. 400కోట్ల తో నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని టాక్.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో రానున్న సినిమా కావడంతో గ్రాఫిక్స్ కోసం భారీ మొత్తం లో ఖర్చు చేయనున్నారట. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుండగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో 20వ చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా కృష్ణం రాజు , భాగ్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే జార్జియా లో కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో జరుగనుంది. సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈఏడాది చివర్లో ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది. వచ్చే నెలలో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రానుంది. అలాగే ఈసినిమాకు ఓ డియర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది.