రెండు సంవత్సరాల తరవాత కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ...!
రకుల్ ప్రీత్ సింగ్... ఈ అందాలభామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం టాలీవుడ్ లో అనేక సినిమాలు చేయడమే. టాప్ హీరోల సరసన అలాగే కుర్రకారు హీరో సరసన ఇలా అందరి హీరోలని ఒక చుట్టు చుట్టేసింది ఈ భామ. అయితే ఈ భామ ఒక సినిమాలోనే కాకుండా బయట కూడా చేయగలరు.
#RakulPreet's new venture after 2 years#RakulPreetSingh https://t.co/gl6XD2lvLJ — 123telugu (@123telugu) April 17, 2020
ఇక అసలు విషయానికి వస్తే తెలుగు, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటించే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ చైన్ బిజినెస్ సంబంధించిన తన వ్యాపారాన్ని పెద్దది చేయాలని చెప్పి భావిస్తుంది. ఇందుకుగాను తను F 45 పేరుతో హైదరాబాద్లో తన జిమ్ లని మొదలు పెట్టేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామకు హైదరాబాదులో 3 సెంటర్లని మొదలు పెట్టేసింది ఈ భామ. అయితే ఈ విషయంలోనే తన వ్యాపారాన్ని ఇంకొద్దిగా విస్తరించాలని చెప్పి భావిస్తోంది.
ఇక అదే ఉత్సాహంతో రెండు సంవత్సరాల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తన కొత్త వెంచర్ ని మొదలు చేయబోతోంది. అయితే ఈ వెంచర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మొదలు చేయబోతోంది. తను సొంతంగా ఒక బ్రాండ్ పేరుతో రెస్టారెంట్లను మొదలుపెట్టడంలో ఉన్నట్లు చెబుతోంది. ఈ విషయాన్ని తాజాగా ఒక మీడియా సంస్థ జరిపిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.
అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ఏమని చెప్పిందంటే ప్రపంచం ఫుడ్, సినిమాలు, ఫిట్నెస్ చుట్టూ తిరుగుతుంటాయి అని చెప్పి తెలిపింది. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు సినిమాలలో నటిస్తుంది. అయితే ఇందులో టాలీవుడ్ కు సంబంధించి ఎటువంటి సినిమా లేదు. ఈ 4 సినిమాలు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తోంది. భారతీయుడు-2, కమల్ హాసన్ సరసన ఇంకో సినిమాలో నటించబోతోంది.