దేశమంతా లాక్డవున్లో ఉంది. మహమ్మారి కరోనాతో అందరూ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ గందరగోళంలో ఏమైన ముఖ్యమైన పనులు అయితే తప్పించి రోడ్ల మీదకు జనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం విధించి నియమ నిబంధనలు పాటించక తప్పదు. మరి ఇదిలా ఉంటే... కృతి కర్బంధ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళి విషయంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కరోనా ప్రభావంతో ఆల్రెడీ నిశ్చితార్ధం అయి పెళ్ళి చేసుకోవాలసిన వాళ్ళు ఆగిపోయారు. ఇక పెళ్ళై విడాకులు తీసుకున్న బాలీవుడ్ జంట హృతిక్-సుజేన్లు కలుసుకున్నారు. మరి పెళ్లికి సిద్ధమైన జంటల పరిస్థితి ఏంటి? ఈ కేటగిరీలోకే వస్తుంది హీరోయిన్ కృతి కర్బందా. ఈ భామ తెలుగులో తీన్ మార్, బ్రూస్ లీ లాంటి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తో ఈ భామ ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. తన ప్రేమ వ్యవహారాన్ని కిందటి ఏడాదే ఈమె బయటపెట్టింది. దీంతో ఈ ఏడాది ఇక ఈ జంట పెళ్లికి రెఢీ అనుకుంటున్నారు అందరూ. అయితే అందరికీ ఓ చిన్నపాటి షాకిచ్చింది కృతి కర్బందా. పెళ్లి చేసుకోవడం కంటే తామిద్దరం ప్రేమించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటోంది కృతి. అంటే దానర్థం ఇప్పట్లో పెళ్లి చేసుకోరట. అలా అని ఈమె ఆ పై వచ్చే ఏడాది కూడా పెళ్ళికి రెఢీ అని అనడం లేదట. కొన్నేళ్ల పాటు ఇలానే ప్రేమించుకుంటారట. పెళ్లికి మానసికంగా సిద్ధమైన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటారట. ఈలోగా వీళ్లు విడిపోకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే బాలీవుడ్ లో అంతే. చాలా డేటింగ్ లు పెళ్లిపీటల వరకు వెళ్లవు. సినిమా ఇండస్ట్రీ అంటేనే అది. ముద్దుముచ్చట్లతోనే ఆగిపోతాయి. ఈ జంటది అలా కాకూడదని కోరుకుందాం. కానీ ముందుగానే మానసికంగా దగ్గరై అని ఇలాంటి డైలాగులు కొట్టిందంటే ఇక డవుటే మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: