ముఖానికి పేపర్‌ అడ్డుగా పెట్టుకుని షాక్ ఇచ్చిన హీరో భార్య.. కారణం ఏంటో తర్వాత చెబుతా అంటుంది!

Edari Rama Krishna

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా నటించేందుకు సిద్దమయ్యారు.  ఆ మద్య శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘2.0’ మూవీలో విలన్ గా నటించారు అక్షయ్ కుమార్.  బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంగా కష్టపడి వచ్చిన హీరో అని చెబుతుంటారు.  బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాని ప్రేమించి పెళ్లాడాడు.  గతంలో వెంకటేష్ నటించిన శీను చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ట్వింకిల్ ఖన్నా స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు ఈ భార్యభర్తలు హ్యాపీ మూవ్ మెంట్స్ కూడా షేర్ ఫన్నీగా షేర్ చేస్తుంటారు. 

 

అక్షయ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు. ఆయన ఇటీవల లారెన్స్ దర్శకత్వంలో కాంచన రిమేక్ ‘లక్ష్మీబాంబ్ ’ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా మీడియాకు తన ముఖం కనపడకుండా పేపర్‌ అడ్డుగా పెట్టుకుని వెళ్లిపోయింది.  అసలే సెలబ్రెటీలు ఏం చేసినా ఇట్టై వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్వింకిల్ ఖన్నా చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.

 

ఈ మద్యకరోనా ఎఫెక్ట్ వల్ల మాస్క్ లు ధరించి సెలబ్రెటీలు బయట తిరుగుతున్నారు.  మరీ ఈ కారణం తోనే  ట్వింకిల్ ఖన్నా ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకొని తన కారు వద్దకు వెళ్లిందా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాను ఎందుకిలా చేశానన్న విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపింది. ఓ కొత్త పంథాకు తెరలేపానని చెప్పుకొచ్చింది. అది ఏమిటన్న విషయం తెలియాలంటే ఎదురు చూడాలని పేర్కొంది. ఆమె తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The next thing {{RelevantDataTitle}}