సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే నటి కంగనా రనౌత్. టాలెంటెడ్ హీరోయిన్ గా కంగనకు ఎంత మంచి పేరుందో తన దుందుడుకు స్వభావం కారణంగా అంతే చెడ్డ పేరు కూడా తెచ్చుకుంది. సినీ ప్రముఖుల మీద విమర్శలు చేయటంతో పాటు హృతిక్ రోషన్ తో ఎఫైర విషయంలో కంగన ప్రవర్తించిన తీరు అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. తాజాగా కంగన సోదరి రంగోలి కూడా ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. కంగన తరుపున మాట్లాడుతూ సినీ ప్రముఖులను తీవ్రంగా విమర్శిస్తోంది.
తాజాగా మరో వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం కంగనకు మేనేజర్గా, స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తోంది రంగోలి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `బాలీవుడ్ సినీ రంగానికి నా ఓపెన్ చాలెంజ్.. కంగన కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ అయినా సోలోగా 60,70, 80, 100 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాను సక్సెస్ చేయగలదా...? ఒక వేళ అలా ఎవరైనా ఉంటే.. ఆ హీరోయిన్ పేరు చెపితే కంగనా శాశ్వతంగా సినిమాలు చేయటం మానేస్తుంది` అంటూ ట్వీట్ చేసింది.
అయితే రంగోలి ఈ ట్వీట్ ఎందుకు చేసిందంటే.. ఇటీవల భాగీ 3 సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సంబంధించి వ్యాఖ్యానించాడు. `మణికర్ణిక సినిమా రిజల్ట్ చూసిన తరువాత నిర్మాతలు లేడీ ఓరియంటెండ్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేరు. కంగన హీరోయిన్గా ధకడ్ అనే సినిమా కూడా ఎనౌన్స్ అయ్యింది. కానీ దాని పరిస్థితి ఏంటీ. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమాను పక్కన పెట్టేశారు` అన్నాడు. ఈ వ్యాఖ్యలకు సమాధానంగా రంగోలిగా ఘాటుగా స్పందించింది.
మరింత సమాచారం తెలుసుకోండి: