ఇటీవల కియారా అద్వానితో డబూ రత్నాని తీసిని న్యూడ్ ఫోటో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన క్యాలెండర్ 25వ ఎడిషన్ సందర్భంగా డబూ ఈ ఫోటో షూట్ చేశాడు. అయితే ఈ షూట్లో కియారా ఇచ్చిన న్యూడ్ ఫోజ్ కాపీ అంటూ ఆరోపణలు వినిపించాయి. గతంలో ఇలాంటి ఫోటోనే తీసిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ మేరీ బార్క్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరిలో తాను గతంలో తీసిన ఫోటోకు తాజాగా డబూ రత్నాని తీసిన కియారా ఫోటోకు ఉన్న పోలికలను తెలియజేస్తూ తాను తీసిన ఫోటోను పోస్ట్ చేశాడు.
ఈ ఫోటోను నెటిజెన్లు కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు. కియారా స్టిల్ను మార్ఫ్ చేసి విచిత్రమైన స్టిల్స్గా డిజైన్ చేశారు. తాజాగా ఈ ట్రోల్స్పై కియారా స్పందించింది. అయితే తన ఫోటో షూట్పై వచ్చిన వివాదం జోలికి పోని కియారా, నెటిజెన్లు చేసిన ట్రోల్స్ను మాత్రం లైట్ అనేసింది. అవన్నీ కూడా పొగడ్తల లాంటివే అంటూ కూల్గా రియాక్ట్ అయ్యింది.
తన పై వచ్చిన కానీ ఆరోపణలపై డబూ రత్నాని కూడా ఇప్పటికే స్పందించాడు. మేరీ కామెంట్స్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. 2002 క్యాలెండర్ కోసం 2001లో టబుతో తీసిన ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన డబూ, కియారా స్టిల్కు సంబంధించి కొంత గొడవ జరుగుతోంది. ఒకవేళ నేను మళ్లీ అదే కెమెరా వాడితే, నేను ఖచ్చితంగా నా కాన్సెప్ట్నే రిపీట్ చేస్తాను` అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు డబూ.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న గిల్టీ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఆ క్యారెక్టర్ తన గత చిత్రాలు కబీర్ సింగ్, గుడ్ న్యూస్లకు పూర్తి భిన్నంగా ఉంటుందని వెల్లడించింది కియారా.
మరింత సమాచారం తెలుసుకోండి: