ఈ సినిమాలతో విసిగిపోయాను.. గుడ్ బై... పవన్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్...!
ఇక మరికొందరు అందం, అభినయం ఉన్నా ఛాన్సులు లేక నిరాశతో ఇండస్ట్రీని వదులుతున్నారు. ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యాయ్ అసలు ఇక సినిమాల్లో నటించనని చెప్పి గుడ్ బై చెప్పేసి స్టడీస్ అంటూ అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడిదే బాటలో మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె కూడా సినిమాలకు ఫుట్ స్టాప్ పెట్టేసినట్టు చెప్పేసింది.
ఆమె తన సోషల్ మీడియాలో తాను సినిమాల నుంచి నిష్క్రమించడం వెనక చాలా బాధగా ఉందని... సౌత్ సినిమాలతో విసుగెత్తిపోయాను. బ్రిటిష్ టెలివిజన్ షోలో నాకు ఓ గుర్తింపు వచ్చింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ గిల్బర్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాను.. లండన్కు కూడా షిఫ్ట్ అవుతున్నాను.. నాకు అక్కడ మంచి గుర్తింపు ఉంటుందని కూడా చెప్పింది. ఇక నికిషా గతంలో బాలీవుడ్ సినిమాలు చేసేందుకు లండన్ నుంచి వచ్చింది.
తెలుగులో పవన్ సరసన కొమరం పులి సినిమాలో నటించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు. చివరకు విసిగిపోయి సినిమాలకు గుడ్ బై చెప్పి చివరకు లండన్ టెలివిజన్ షోలు చేసుకునేందుకు డిసైడ్ మకాం మార్చేసింది.