తెలుగు, తమిళ భాషల్లో నటిగా సత్తా చాటుకుంటున్న మలయాళీ భామ అనుపమపరమేశ్వరన్. కేరళలోని తిరుచూరు జిల్లాలో ఇరింజన్ గూడలో పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అనుపమ చిన్న నాటి నుంచే సంగీతం, నృత్యం పట్ల ఆశక్తిని పెంచుకుంది. స్కూల్లో నిర్వహించే కల్చరల్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. కళల పట్ల అనుపమ మక్కువ తెలుసుకున్నతల్లిదండ్రులు ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహంతో అనుపమ తన సొంత ఊరిలోనే ఓ డ్రామా క్లబ్లో మెంబర్షిప్ సంపాదించుకుంది.
ఆ తర్వాత ఉన్న విద్య కోసం కొట్టాయం చేరుకున్నా. ఆమె సినీ కెరియర్ కోసం కాలేజ్ని వదిలిపెట్టేసింది. మలయాళ మూవీ ప్రేమమ్తో తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తొలిచిత్రంతోనే సూపర్సక్సెస్ని చవి చూసింది. అనంతరం మలయాళంలోనే జేమ్స్ అండ్ అళైస్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకి అడుగు పెట్టిన తర్వాత చేతినిండా సినిమాలతో సూపర్ బిజీగా మారిపోయింది. అఆ, ప్రేమమ్, శతమానంభవతిలతో విజయపధంతో దూసుకుపోతుంది.
ఇక కోలీవుడ్లో కోడి సినిమాలో సూపర్స్టార్ ధనుష్తో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుపమ అక్కడ హిట్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మలయాళంలో జొమ్మంటేల్ సువీ సేషమల్ల అనే మూవీలో నటిస్తుంది. ఇక ప్రస్తుతం తన అందచందాలతో టాలీవుడ్లో టాప్హీరోలతో నటించేస్తూ వరుస హిట్లతో దూసుకువెళుతుంది. ఇప్పటివరకు అనుపమ డ్రస్సింగ్ స్టైల్ అంతా చాలా ట్రెడిషనల్గా వెళ్ళింది. మరి ఇక నుంచి కాస్త తన సొగసులను ఆరబోసి మరీ టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోందట. మరి నెక్స్ట్ సినిమా నుంచి చూడాలి ఆమె ఏం చేయబోతుంది అన్నది. అయితే ఇప్పటి వరకు మీడియం హీరోల పక్కన నటించింది. మరి ఆ తర్వాత అన్నా పెద్ హీరోలతో అవకాశం వస్తుందేమో చూడాలి. అలాగే `అ` చిత్రంలో తను కాస్త నెగిటివ్ క్యారెక్టర్లో కనిపించి అదరకొడుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: