అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ఫిదా అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆమె నటన ఆమె అభినయం ఈ తరం తారలకు ఎవ్వరికీ లేదు. అంత అద్భుతమైన నటి శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన తార శ్రీదేవి. అయితే శ్రీదేవి గురించి ఎవ్వరికీ తెలియని ఒక నిజం ఏంటంటే జయప్రదకి శ్రీదేవికి అస్సలు పడేది కాదట. ఇక వాళ్లిద్దరినీ కలపడానికి రాఘవేంద్రరావు ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఇక వీరిద్దరూ ఒకే సినిమాలో నటించేటప్పుడు మాత్రం సీన్లో మాత్రం జీవించేసేవారట.
అయితే వీరిద్దరు తిరిగి కట్ చెప్పగానే మళ్ళీ ఎడమెహం, పెడమోహం వేసుకుని ఎవరికి వారు కూర్చునేవారట. ఒకసారి శ్రీదేవిని, జయప్రదను ఒకేరూమ్లో ఉంచి తాళం వేశాడు రాఘవేంద్రరావు. అయితే కాని లోపల మాత్రం చెరోమూల కూర్చుని ఉండిపోయారట. ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదట. ఆ తర్వాత రాఘేవేంద్రరావు కూడా వీరిద్దరినీ వదిలేశాడు. ఇలానే జితేంద్ర కూడా హిందీ సినిమాలో నటించేటప్పుడు ఇద్దరినీ మేకప్ రూమ్లో వేసి తాళం వేశాడు. జయప్రద, శ్రీదేవిని కలపడానికి ఎంత ప్రయత్నించినా అతనికి కూడా కుదరలేదట.
వీరిద్దరూ లైఫ్లాంగ్ శ్రతువులుగానే ఉండిపోయారు. విచిత్రం ఏమిటంటే ఐదేళ్ళ క్రితం జయప్రద ఇంట్లో ఫంక్షన్కి శ్రీదేవి వెళ్ళారు. శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసింది సూపర్ స్టార్ కృష్ణనే. ఏ భాషలో చూసుకున్నా కూడా వీరిద్దరివే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి దాదాపుగా 29 సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో వీరిద్దరూ హిట్ పెయిర్గా నిలిచారు. శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్న బోనీకపూర్ ఆమెను కష్టాలపాలు చేశాడు. మా ఇంటిని నాశనం చేశావంటూ బోనీతల్లి శ్రీదేవిని కడుపు మీద కొట్టబోయింది. అప్పటికే శ్రీదేవి ప్రెగ్నెంట్. ఎంతో తెలివిగా శ్రీదేవి పక్కకు తిరగడంతో ఆమెకు వెనకవైపు దెబ్బ తగిలింది. అందంతో తన కొడుకుని బుట్టలో వేసుకున్నావంటూ ప్రతీరోజూ బోనీకపూర్ తల్లి శ్రీదేవినితిట్టేదట.
మరింత సమాచారం తెలుసుకోండి: