తేజ తక్కువోడేం కాదు.. ఒక్కసారే ఇద్దరు హీరోలను లైన్లో పెడుతున్నాడే?
తెలుగు ఇండస్ట్రీలోకి ‘చిత్రం’ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు తేజ. మొదటి నుంచి వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. జయం చిత్రంతో మంచి విజయం అందుకున్న తేజ తర్వాత ఏ చిత్రం తీసిన అపజయం అయ్యాయి. దాంతో ఇక లాభం లేదనుకుని కమర్షియల్ చిత్రాల వైపు మొగ్గు చూపాడు. మహేష్ బాబు తో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం తీయాలని భావించి ‘నిజం’ తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు తేజ. అప్పుడప్పుడు ఒకటీ రెండు తీసినా ఫ్లాప్ టాకే వచ్చాయి. ఆ మద్య రానా హీరోగా కాజల్ హీరోయిన్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.
ఆ వేంటనే ఎన్టీఆర్ బయోపిక్ తేజ దర్శకత్వం లో వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ చిత్రం క్రిష్ దక్కించుకున్నాడు. గత ఏడాది బెల్లంకొండ శ్రీను, కాజల్ జంటగా తెరకెక్కించిన సీత చిత్రం కూడా దెబ్బ కొట్టేసింది. ప్రస్తుతం మంచి కథలు రెడీ చేసుకుని ఉన్నాడట తేజ. ఆ మద్య ఆయన రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. ఈ రోజున తేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి చిత్రాలకు సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు.
ఒక టైటిల్ 'అలిమేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' . అయితే 'అలిమేలుమంగ - వెంకటరమణ' చిత్రంలో యాక్షన్ హీరో గోపిచంద్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 'రాక్షస రాజు రావణాసురుడు' చిత్రంలో రానా నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను లైన్లో పెట్టినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు.