"అభిమానులకి నిరాశని మిగిల్చిన మహేష్ బాబు"

Kumar Vinod


మహేష్ బాబు కి అభిమానులు ఎక్కువ.. ఎందుకంటే మహేష్ బాబు నటనతో అందరిని ఆకర్షిస్తారు.. దానికి తోడు మహేష్ బాబు పర్సనాలిటీ మరియు అందం గూర్చి వేరే చెప్పాలిసిన పని లేదు.. డైలాగ్ డెలివరీ కూడా సూపర్ గా ఉంటుంది.. సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు గా చిత్రసీమ కి పరిచయం అయ్యారు.. చిన్నప్పటి నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు..

 

రాజకుమారుడు సినిమాతో అందరి మనసుల్ని దోచుకుని మెగా ప్రిన్స్ అయ్యాడు.. అలాంటి మహేష్ బాబు ఎక్కడన్నా ఫంక్షన్స్ కి గాని, ఇంటర్వ్యూ కి గాను వస్తున్నాడని తెలిస్తే ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు.. అక్కడ అంతా పండగ హడావుడే.. ఇలాంటి ఒక పండగ వాతావరణం మచిలీపట్నం లో చోటు చేసుకుంది..

 

సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు మహేష్ బాబు ని అతిధి గా పిలిచారు.. అందులో పాల్గొనే అందుకు వచ్చిన సినీ హీరో మహేష్‌బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్‌బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు..

 

కానీ విపరీతమైన వర్షం కారణంగా మహేష్ బాబు వెనుదిరిగి వెళ్లిపోయారు.. సంబరాల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.. అయన వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వర్షం పడడం ఆగింది.. కానీ ఈలోపే మహేష్ బాబు వెళ్లిపోయాడు. రాత్రికి యధావిధిగా టీవీ షోని నిర్వహించారు. మహేష్‌ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

 

మహేష్‌ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్‌ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: