టాలీవుడ్ గుస‌గుస‌: అమరావతిలో తిరుగుతున్న టాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీ...?

praveen

జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అనే అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే... ఇక రాజధాని మార్పు అంశం తెరమీదకి వచ్చినప్పటినుంచి రాజధాని ప్రాంతంలో ఆకాశాన్నంటిన భూముల ధరలు క్రమక్రమంగా తగ్గడం మొదలు పెట్టాయి. ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల  ప్రకటన చేయడం.. రాజధాని అధ్యయనం కోసం నియమించిన జిఎన్ రావు  కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టులు జగన్ నిర్ణయానికి అనుకూలంగా రావడంతో అమరావతి నుంచి రాజధాని మార్పు తథ్యం అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమరావతిలో భూముల ధరలు తగ్గిపోయాయి . దీంతో అమరావతిలో భూములు కొన్న వారందరూ బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 

 ఒకప్పుడు అమరావతిలో రాజధాని వస్తే  భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి అని నమ్మి  భారీగా భూములు కొనుగోలు చేసిన వారందరూ ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. నష్టం వచ్చినా సరే కానీ భూములను మాత్రం అమ్మి వేయాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు  చెందిన ఓ బడా నిర్మాత కూడా అమరావతి లో భారీగా భూములు కొన్నారు అని సమాచారం. ఈ క్రమంలో జగన్ నిర్ణయంతో అమరావతిలోని భూముల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో అమరావతిలో తనకు ఉన్న భూములను ఎలాగోలా అమ్మేయ్యాలి అని  ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ బడా సెలబ్రిటీ కి కేవలం అమరావతిలోనే  కాదు వైజాగ్ లోను భూములు ఉన్నాయి. 

 

 

 

అంతేకాకుండా బెంగళూరు పుణే రియల్ ఎస్టేట్లో ను భారీగా పెట్టుబడులు పెట్టాడు ఈ బడా నిర్మాత.ఇకపోతే  అమరావతి నుంచి రాజధాని తరలింపు పై ఖాయం అని తెలియటంతో  భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో అమరావతిలో తనకున్న భూములను నష్టాల కైనా సరే అమ్ముకోవాలని అమరావతిలోని ఈ టాలీవుడ్ బడా సెలబ్రిటీ తిరుగుతున్నట్టు టాక్  వినిపిస్తోంది.నష్టాలకు  భూములు అమ్మినా సరే కానీ భూముల ధరలు మరింత పడిపోయిన తరువాత అమ్మితే  తనకు వచ్చే  డబ్బులు కూడా రావని ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ భావిస్తున్నారట. మరోవైపు ఆయన నిర్మించిన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉండటంతో టాలీవుడ్ బడా నిర్మాతకు మరో టెన్షన్ కూడా పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: