సినిమా విడుదల కాకముందే ఓవర్సీస్ లో అదరగొట్టే బిజినెస్ చేస్తున్న ‘అల వైకుంఠపురంబులో’..?
విషయంలోకి వెళితే 'అలా వైకుంఠపురం లో' సినిమాకి సంబంధించి ఓవర్సీస్ హక్కులను ఒక బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ నేడు అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ హక్కులు కూడా అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా హక్కులు కూడా ఇంచుమించు అదే ధరకు అమ్ముడు అయినట్లు సమాచారం. ఓవర్సీస్ లో బన్నీతో పాటు త్రివిక్రమ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉండడంతో, ఇంత భారీ ధరకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అయిన నేపథ్యంలో సినిమా అత్యధిక ధర పలికిందని అదేవిధంగా సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకోవడం తో రికార్డు స్థాయిలో సినిమా ఓవర్ సీస్ హక్కులు పలికాయి అని అంటున్నారు చాలామంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా నవదీప్, అక్కినేని సుశాంత్, సునీల్ అదేవిధంగా సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు.