టాలీవుడ్ హీరో రవితేజకు ప్రస్తుతం బ్యాడ్ టైం నటిస్తోంది. ఈ హీరో హిట్ కొట్టి చాలా సమయమే అవుతుంది. ఇటీవల కాలంలో ఒక్క "రాజా ది గ్రేట్" సినిమా తప్ప రవితేజ నటించిన ఏ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీనితో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం రవితేజ, వీఐ ఆనంద్ దర్శకత్వంలో "డిస్కోరాజా" రాజా సినిమాలో నటిస్తున్నాడు అని అందరికి తెలిసిన విషయమే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన తర్వాతి ప్రాజెక్ట్ను కూడా ఫైనల్ చేశాడు హీరో మాస్ మహరాజ్ రవి తేజ. తనతో గతంలో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు రవి తేజ.
గురువారం ప్రారంభం కానున్న ఈ సినిమాకు "క్రేజీ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. రవితేజ మరోసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. షూటింగ్ ప్రారంభం అవుతున్న సందర్భంగా రవితేజ కొత్త లుక్ తో పాటు టైటిల్ను కూడా రిలీజ్ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నాడు అని సమాచారం.
సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ లో బీ. మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా శృతిహాసన్ ను ఎంచుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2020 సంవత్సరం వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర సభ్యులు.