నాన్ వెజ్ పిచ్చితో చివరకు వాటిని కూడా తినేసిన రానా..!!

murali krishna
రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రానా.. 2010లో లీడర్ మూవీతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి హీరో పాత్రలే చేయాలి లేదా ఒక భాషకే పరిమితం కావాలి అని రానా ఎప్పుడు అనుకోలేదు. లీడర్ తర్వాత రానా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు.అలాగే హీరో పాత్రలే కాకుండా బలమైన సహాయక పాత్రలు మరియు ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరోవైపు నిర్మాతగా, వ్యాపారవేత్తగా సైతం దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యెక్క వేట్టయాన్ మూవీలో రానా కీలక పాత్రను పోషిస్తున్నాడు. జై భీమ్ మూవీ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని టి సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న వేట్టయాన్ మూవీ 2024 అక్టోబర్ లో విడుదల కాబోతోంది.
ఈ సినిమా గురించి పక్కన పెడితే.. రానా దగ్గుపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా వృత్తిపరమైన విషయలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తాను ఎంత పెద్ద నాన్ వెజిటేరియనో వివరిస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. రానాకు నాన్ వెజ్ అంటే పిచ్చట. ఎంతా అంటే చివరకు పాములు, మొసళ్ళు కూడా తినేశాడట. అవును, ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించాడు. రానా మాట్లాడుతూ..`నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. వెజ్ కన్నా నాన్ వెజ్ ఎక్కువ తింటాను. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర కోసం మేకోవర్ అవ్వడానికి మూడు నెలలు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాను. చాలా కష్టంగా అనిపించింది. షూటింగ్ అయిన వెంటనే నాంపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ రెస్టారెంట్ ఆదాబ్ కు హలీం తిన్నాను. అది నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చెప్పాలంటే నాన్ వెజ్ లో ఆల్మోస్ట్ అన్నిటినీ నేను ట్రై చేశాను.
ఫారెన్ కంట్రీస్‌కు వెళ్తే అక్కడ లోకల్ గా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తింటాను. పాములు, మొసళ్ళు కూడా తిన్నాను. ఇంకా ఏమేం తిన్నానో చెబితే భయపడతారు` అంటూ రానా చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాములు, మొసళ్ళు తిన్నాని రానా చెప్పడంతో నెటిజన్లు షాకైపోతున్నారు. నాన్ వెజ్ పై ఎంత పిచ్చి ఉంటే మాత్రం పాములు, మొసళ్ళను కూడా తినాలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి కక్కుర్తి రా బాబు అంటూ మరికొందరు నెటిజన్లు రానా వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు.రానా దగ్గుబాటి ప్రస్తుతం సినిమాలతో, నిర్మాతగా, బిజినెస్ లతో.. బిజీగా ఉన్నాడు. సినీ పరిశ్రమలో చాలా ట్యాలెంట్స్ ఉన్న వాళ్ళల్లో రానా ఒకరు.నటుడు అవ్వకముందే సినీ పరిశ్రమలో చాలా వర్క్స్ చేసారు. టాలీవుడ్ సెలబ్రిటీలలలో చాలా మంది కంటే కూడా రానాకే బాలీవుడ్ లో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. త్వరలో రజినీకాంత్ వెట్టియన్ సినిమాలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: