గత ఏడాది ప్రారంభంలో భాగమతి సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క. అశోక్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రందాదాపు 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవలే 'నిశ్శబ్దం' అనే చిత్రాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. నిన్న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా టీజర్ నవంబర్ 7న విడుదలకానుంది.
హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ నటుడు సుబ్బరాజు, హీరోయిన్ అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అంత యూఎస్ లోని సియాటెల్ లోనే జరిగింది. మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై కోన వెంకట్ , టీజీ విశ్వప్రసాద్ ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ, హిందీ తో పాటు ఇంగ్లీష్ లోనూ విడుదలచేయనున్నారు.
ఇక ఈచిత్రం తరువాత అనుష్క ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కించినున్నపొన్నియన్ సెల్వన్ లో అనుష్క ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి ఓ క్లారిటీ రానుంది.