మన లైఫ్ మన చేతులో ఉందో లేదోగాని మనందరి చేతిలో ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది.. ఆ ఫోన్లో కన్ఫామ్గా ఓ సీక్రెట్ ఉంటుంది.. ఈ సీక్రెట్ ఏంటో ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ నవ్వులు పూయిస్తున్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రమే ‘మీకు మాత్రమే చెప్తా’. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. షమీర్ దర్శకత్వం వహించారు.
నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తదితరులు నటించారు. విజయ్ దేవరకొండ నిర్మాతగా ఉండటంతో పాటు.. ఈ ట్రైలర్ను మహేష్ బాబు విడుదల చేయడంతో సినిమాకి హైప్ వచ్చింది. ఇక ట్రైలర్ కూడా ఫుల్ ఫన్ రైడ్గా ఉంది. లేటెస్ట్ ట్రైలర్పై మీరూ ఓ లుక్కేయండి.
గతంలో మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు దేవరకొండను చీఫ్ ఫస్ట్గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్గా మహేష్ బాబు ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ను లాంచ్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దేవరకొండ తన ప్రతి సినిమాలోనూ ఏదొక ప్రత్యేకతను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అలాగే ఈ చిత్రం కూడా ఫ్యాన్స్ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. అటు మహేష్ బాబు ట్రైలర్ను లాంచ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగినట్లే. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.