రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసే ముందు చివరిగా పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన సినిమా 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 25వ సినిమాగా రూపొందిన అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్లు పెద్దగా రాబట్టలేకపోయిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం హిందీ అనువాద వెర్షన్ మాత్రం యూ ట్యూబ్ లో దుమ్మురేపేసింది. గత ఏడాది అక్టోబర్లో యూ ట్యూబ్ లో దీనిని పెట్టగా, ఇప్పటికి 100 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. 'ఎవడు 3' పేరుతో యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ను అంటే 10కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్ను క్రియేట్ చేసింది. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ జనం జై కొట్టేశారు.
ఇక ఇదిలా ఉంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేస్తున్నాడా.. ? అంటే అవుననే వినిపిస్తోంది. మొన్నటి వరకూ ఇక సినిమాలకు రాడు అనే ప్రచారం జరిగినా.. అటు పొలిటికల్ గా కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ లో కొంత సామాజిక సందేశం ఉన్న కొన్ని సినిమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలాంటి కథాంశాలు వస్తే చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈ క్రమంలో ఓ మంచి కథతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. పైగా ఇది ఓ రీమేక్. పవన్ కు రీమేక్ లు బానే కలిసొస్తాయి. అంతేకాక ఇందులో నేటి సమాజంలోని అమ్మాయిలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందంటున్నారు.