చివరి అరగంట సైరా అరుపులేనా..!

shami
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ కు సిద్ధమవుతుంది. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమాలో బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరక్టర్ సురేందర్ రెడ్డి సినిమాలో చివరి అరగంట మాములుగా ఉండదని చెబుతున్నారు.


సైరా ఒక ఎమోషనల్ జర్నీ అని.. అలాంటి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం తన అదృష్టమని అన్నారు సురేందర్ రెడ్డి. ఇక మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపం మరోసారి ఈ సినిమా ద్వారా తెలుస్తుందని అన్నారు. సినిమాలో అన్ని బెస్ట్ సీన్స్ అని చెప్పుకొచ్చిన సూరి చివరి అరగంట హైలెట్ గా ఉంటుదని అంటున్నారు.


సైరా సినిమా మీద చిత్రయూనిట్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ ఆకట్టుకోగా సినిమా మరో సంచలనం సృష్టించడం గ్యారెంటీ అంటున్నారు. 


ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మించారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. నయనతర ఫీమేల్ లీడ్ గా నటించగా తమన్నా కూడా స్పెషల్ రోల్ లో నటించింది. స్వీటీ అనుష్క కూడా చివర్లో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: