ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమాను ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్ త్వరలోనే ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'జనగణమన' అనే సినిమా చేయాలని ప్రయత్నాలు చేసిన పూరి జగన్నాధ్ కి చుక్కెదురయింది. ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్న క్రమంలో తనతో మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకోలేదని ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పూరిజగన్నాధ్ మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో ఈ విషయం అప్పట్లో పెద్ద రగడ సృష్టించింది. అయితే మహేష్ తో చేయాల్సిన జనగణమన సినిమానే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినబడుతున్నాయి. ఇదే ఈ క్రమంలో సాహో సినిమా కోసం రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుని దారుణమైన ఫలితాన్ని అందుకున్న ప్రభాస్...సినిమాలను త్వరగా తీసే పూరితో చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బుజ్జిగాడు ఏక్నిరంజన్ సినిమాలు వచ్చాయి కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.