జ‌గ‌న్ వ‌ద్దు.. ష‌ర్మిలే ముద్దు.. తేల్చిచెప్పిన వైఎస్‌. విజ‌య‌మ్మ‌..!

Suma Kallamadi
మరికొద్ది గంటల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఒక కీలకమైన వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారు, వైఎస్సార్‌ను ప్రేమించే వారు, యావత్ లోక్‌సభ కడప నియోజకవర్గం ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వీడియోను జనాల్లోకి వదిలారు. వైఎస్ విజయమ్మ వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ.. "వైఎస్సార్‌ బిడ్డ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. కడప ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆమెకి ఇవ్వాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. షర్మిలను పార్లమెంటుకు పంపించాలని కడప ప్రజలకు విన్నపం చేస్తున్నా" అని విజ్ఞప్తి చేశారు.
విజయమ్మ ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే అటువైపు జగన్‌కు, ఇటువైపు కూతురు షర్మిలకు సపోర్ట్ చేయకుండా అమెరికా వెళ్లిపోయారు. కూతురు, కొడుకు ఇద్దరిలో ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తారు? వారిద్దరిలో ఆమెకు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నలు ఏపీ ప్రజల మెదళ్లలో ఇవాల్టి దాకా మెదిలాయి. అయితే లేటెస్ట్ వీడియోతో ఆమెకు షర్మిల అంటేనే ఇష్టమని తేలిపోయిందని కొందరు అంటున్నారు. విజయమ్మ వీడియో మెసేజ్ ప్రస్తుతం ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. అవినాష్ షర్మిల కు సోదరుడు అవుతారు. సోదరుడు పైనే ఆమె పోటీ చేస్తున్నారు. ఈ కుటుంబ గొడవలు ఆంధ్రప్రదేశ్ లో చాలా హార్ట్‌ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి షర్మిల అవినాష్ ఒక హంతకుడు అని, వివేకానందను గొడ్డలితో హత్య చేసింది ఆయనేనంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి హంతకుడికి ఓటు వేయొద్దు అని చెబుతూ కడప అంతటా తిరుగుతున్నారు. జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే తనకు జగన్ వద్దు, షర్మిలనే ముద్దు అని తాజా వీడియోతో విజయమ్మ తేల్చి చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: