రజినీకాంత్ కోలీవుడ్ సూపర్ స్టార్. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. కబాలి, కాలా సినిమాల తరువాత రజినీకాంత్ రోబో 2పాయింట్ 0 చేశారు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఈ హిట్ తరువాత రజినీకాంత్.. పేట సినిమా చేశారు. గత రెండేళ్లుగా రజినీకాంత్ వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.
ప్రస్తుతం ఈ హీరో దర్బార్ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. నయనతార, రజినీకాంత్ లకు సంబంధించిన విషయాలను షూట్ చేస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ను చేయబోతున్నారు. మురుగదాస్ తో చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది.
ఈ సినిమా తరువాత రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్నది. దర్బార్ రిలీజైన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈలోపు శివ.. తమిళ్ హీరో సూర్యతో సినిమా చేయాల్సి ఉన్నది. త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది చివరి వరకు శివ సూర్య సినిమాను పూర్తి చేస్తే.. వచ్చే ఏడాది నుంచి శివ సినిమా స్టార్ట్ అవుతుంది.
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2020 దీపావళి కానుకగా తీసుకురావాలని రజినీకాంత్ ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్.. మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థనే శివ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుందా లేదంటే మరో సంస్థ నిర్మిస్తుందా చూడాలి. అంతేకాదు, ధనుష్ తో రజినీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉన్నది. మల్టీస్టారర్ గా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమాలు పూర్తి చేసి 2021 లో జరిగే ఎన్నికల్లో రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.