జగన్ని ఏమైనా అంటే తాట తీస్తా...!!

Satya
జగన్ అంటేనే అందరికీ పిచ్చి అభిమానం. ఒకసారి జగన్ మీద అభిమానం కలగాలే కానీ అధి ఈ జన్మకు పోదు. ఎందుకు జగన్ అంటే ఇష్టం అంటే చెప్పలేరు కూడా. ఇక జగన్ సైతం తన వారకున్న  వారి కోసం ఎంతదూరమైనా వెళ్తారు. అందుకోసం ఆయన ఎటువంటి విమర్శలకైనా సిధ్ధపడతారు. ఇపుడు జగన్ కోసం కూడా తాము ఎందాకైనా వెళ్తామనే వారు కనిపిస్తున్నారు.


వారిలో సినీ సీమ నుంచి వచ్చిన కమెడియన్ ప్రుధ్వి ఎపుడు ముందు వరసలో ఉంటారు. థ‌ర్టీ యియర్స్ ఇండస్ట్రీగా అందరి మన్ననలు అందుకుంటున్న సమయంలో అసలు అధికారంలో లేని జగన్ వైపు ప్రుధ్వీ మొగ్గారు. అంతే కాదు జగన్ పార్టీలో చేరి అయన కొసం జనంలో ప్రచారం కూడా చేస్తూ వచ్చారు. ప్రుధ్వీ  జగన్ మీద ఎంత అభిమానం అంటే జగన్ని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తానంటూ ముందుకు వస్తున్నారు.


ఈ రోజు చంద్రగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతు, నటుడు రాజేంద్రప్రసాద్ తాజాగా తన మీద చేసిన కామెంట్స్ కి ప్రతిస్పందించారు. తాను జగన్ని సినిమా వాళ్ళు కలవాలని కోరారని, ఇందులో తప్పేముందని ప్రుధ్వి ప్రశ్నించాడు. అసలు ఆ విషయంలో తప్పు చూసిన వాళ్ళదే తప్పు అన్నాడు. అక్కడికి తనపైన వ్యంగ్యంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడడం తగదని ఆయన అన్నారు.


చంద్రబాబు సీఎం అయితే సన్మానాలు చేస్తారు, అదే జగన్ సీఎం అయితే మాత్రం కనీసం కలవాలనుకోరా అని ప్రుధ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను గట్టిగానే ఉంటానని ఆయన చెప్పారు. ఇకపై ఎవరైనా జగన్ గురించి ఒక్క మాట తూలినా సరే తాను వూరుకోనని, తాట తీస్తానని ప్రుధ్వి హాట్ వార్నింగ్  ఇచ్చేశాడు. మరి టాలీవుడ్ దీని మీద  ఎలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: