సింగిల్ స్క్రీన్ కష్టాలు తీరేనా..?
నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య పర్సంటేజ్ పద్ధతి ఉండేది.. ఆ తర్వాత కాలంలో ఎగ్జిబిటర్లకు రెంటు మాత్రమే పే చేస్తూ వచ్చారు డిస్ట్రిబ్యూటర్లు.. దీనికి తోడు జీఎస్టీ కూడా వేయడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు ఇప్పుడు మరింత పెరిగాయి. తాజాగా సినిమాల రిలీజ్లు కూడా లేకపోవడంతో ఆ నష్టాలు ఇంకా ఎక్కువై మూసేసే పరిస్థితి వచ్చింది. దీన్ని చక్కదిద్దేలా ఫిలిం ఛాంబర్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంది .. అందుకే మరోసారి పర్సెంటేజ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది..
మరి ఆ ఈ పర్సంటేజ్ విధానం ఏ విధంగా తీసుకొచ్చారు అనే విషయానీకొస్తే నైజాంలో రూ .30 కోట్లకు పైబడి హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం డిస్ట్రిబ్యూటర్లకు 75%, ఎగ్జిబిటర్లకు 25 శాతం ఉండాలని.. అలాగే రెండో వారం 55% డిస్ట్రిబ్యూటర్లకు, 45 శాతం ఎగ్జిబిటర్లకు , ఆ తర్వాత వారాలకు 40-60, 30-70 శాతం తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపోతే రూ .10 కోట్ల నుంచి రూ.30 కోట్ల రేటుకు కొన్న సినిమాలకు తొలి వారం డిస్ట్రిబ్యూటర్లకు 60% ఎగ్జిబిటర్లకు 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు . తర్వాత వారం చెరో 50%, మూడో వారం 40-60 నాలుగో వారం 30-70 లెక్కన షేర్ చేసుకుంటారు . ఇక ఈ నేపథ్యంలోనే జూన్ ఫస్ట్ నుంచి తాము తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వస్తాయని కూడా ప్రకటించారు.. మొత్తానికైతే ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలు కొంతవరకు తీరుతాయని ఇండస్ట్రీ పెద్దలు కూడా చెబుతున్నారు.. మరి ఈ పర్సంటేజ్ విధానం ఏ మేరకు అమలు అవుతుందో చూడాలి.