'లీక్'ల బాధలో `ఇస్మార్ట్ శంకర్` !
అయితే విషయం తెలుసుకున్న పూరీ జగన్నాథ్ తమ స్క్రిప్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో నుండి తొలిగించాలని కోరితే మురళీ కృష్ణ భారీగా డబ్బు డిమాండ్ చేశారట. దాంతో చేసేదేం లేక ఈ డాషింగ్ డైరెక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తమ స్క్రిప్ట్ ను లీక్ చెయ్యడమే కాకుండా.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని మురళీ కృష్ణ పైన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
జూలై 12న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్ కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి - ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.