వరల్డ్ కప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్లు లేరా.. రోహిత్ అదిరిపోయే ఆన్సర్?

praveen
వెస్టిండీస్ యూఎస్ వేదికలలో జరగబోయే టి20 వరల్డ్ లో విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత జట్టు. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయం గురించి అటు భారత అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఇటీవల 15 మంది ఆటగాళ్లతో కూడిన టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు గురించి చర్చ జరుగుతుంది. కాగా ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో కలిసి ఇక వరల్డ్ కప్ జట్టు విషయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే t20 వరల్డ్ కప్ లో ఎందుకు ఆఫ్ స్పిన్నర్లను ఎంపిక చేయలేదు అంటూ రిపోర్టర్లు ప్రశ్నించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పాడు.


 సాధారణంగానే రోహిత్ శర్మ ఇలా ప్రెస్ మీట్లలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఫన్నీగా ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల వరల్డ్ కప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్లు ఎందుకు లేరు అంటూ రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఇలాగే స్పందించాడు. జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు.. అదేమైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటూ అడగగా.. నేను ఉన్న అంటూ రోహిత్ శర్మ సైగలు చేస్తూ నవ్వుతూ బదిలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా టీమిండియాలోకి వచ్చిన రోహిత్ తర్వాత కాలంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. ఇక ఆఫ్ బ్రేక్ స్పిన్ బౌలర్గా రోహిత్ పేరిట ఒక హ్యాట్రిక్ కూడా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: