నా హృదయపూర్వక కృతజ్ఞతలు : మహేష్ బాబు

siri Madhukar
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిన్నతనంలోనే తన సత్తా చాటిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత మురారి తో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పోకిరి’సినిమాతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇలా వరుసగా ఒక్కడు, అతడు, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగారు. 


కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో అందరి మనసు దోచుకున్న మహేష్ గత ఏడాది ‘భరత్ అనే నేను’సినిమాలో సీఎం గా నటించి పొలిటికల్ టచ్ ఇచ్చాడు.  నటన పరంగా ప్రతిసినిమాలోనే తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న మహేష్ బాబు తాజాగా ‘మహర్షి’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  విడుదలైన ఈ చిత్రానికి అన్ని సెంటర్ల నుంచి సానుకూల స్పందన కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. 


తాజాగా మహేష్ బాబు తన ట్విట్టర్ వేధికగా.. ఇంత గొప్ప ఘనవిజయం అందించినందుకు ‘మహర్షి’ టీమ్ మెంబర్స్ కు, దర్శకుడు వంశీ పైడిపల్లికి, ప్రతి ఒక్కరికి తన హృదయం లోతుల్లోంచి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తన 25వ చిత్రాన్ని భారీ హిట్ గా మలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, మహర్షి చిత్రం పట్ల విశేష స్పందన చూపిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు.
My amazing team of #Maharshi, my director @directorvamshi and I, THANK YOU ALL from the bottom of our hearts for this overwhelming success 🙏🙏🙏

— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: