ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ నిర్మాత, దర్శకులు విజయబాపినీడు అనారోగ్యంతో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందు ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీదేవి ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు.
నారా జయశ్రీదేవి గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నారా జయశ్రీదేవి శ్రీమంజునాథ, వందేమాతరం, చంద్రవంశం వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. నారా జయశ్రీదేవి మరణ వార్త వినగానే టాలీవుడ్ షాక్ కి గురైంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.