పెళ్లి కాకుండానే తల్లయింది.. శ్రీదేవి, రేణు దేశాయ్ రూటులోనే..

Chakravarthi Kalyan

మాతృత్వం స్త్రీకి వరం అంటారు. మరి అలాంటి వరం కావాలంటే ఏకైక మార్గం వివాహం.. కానీ అంత సీస్ లేదంటున్నారు కొందరు ఆధునిక మహిళలు. సంతానానికి, పెళ్లీకి సంబంధం ఏంటని ఎదురుప్రస్నలు వేస్తున్నారు. పెళ్లితో సంబంధం లేకుండానే తల్లులం అవుతామంటున్నారు.



అనడమే కాదు..అలాగే పెళ్లి కాకుండానే పిల్లలను కని సంచలనం సృష్టిస్తున్నారు. గతంలో హీరోయిన్ శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. బోనీ కపూర్ ను పెళ్లాడాక తల్లయింది. టెక్నికల్ గా పెళ్లికి ముందే తల్లయినట్టేగా..


మరో హీరోయిన్ రేణూ దేశాయ్ కూడా పవన్ తో సహజీవనం చేసి పిల్లలను కన్న తర్వాతే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సరోగసీ విధానం వరంగా మారింది. ఈ టెక్నాలజీతో ఇప్పుడు పెళ్లి పెటాకులు లేకుండానే పిల్లను నవమాసాలు మోసి కనే ఇబ్బందులు లేకుండానే తల్లులవుతున్నారు.



తాజాగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ సరోగసీ విధానం ద్వారా తల్లయింది. తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చాలా క్లారిటీగానే చెప్పేసింది ఏక్తా కపూర్. సక్సస్ ఫుల్ టీవీ సీరియళ్ల నిర్మాతగా ఏక్తా కపూర్ చాలా సక్సస్ ఫుల్ ఉమన్. గతంలో మన తెలుగమ్మాయి మంచు లక్ష్మి కూడా సరోగసీ విధానంతో ఓ పాపకు తల్లయిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: