తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ మొదటి చిత్రం ‘చిరుత’. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నేహాశర్మ నటించింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఏ తెలుగు చిత్రంలో కనిపించలేదు నేహశర్మ. ‘చిరుత’ చిత్రంలో పొగరుబోతు అమ్మాయిగా అదరగొట్టిన నేహాశర్మకు తర్వాత తెలుగులో మళ్లీ ఛాన్స్ లు రాలేదు. బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..కానీ అక్కడ కూడా కలిసి రాలేదు.
దాంతో మోడలింగ్ పై దృష్టి పెట్టిన నేహా శర్మ సోషల్ మీడియాలో తన అందాల ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. తానే ఒక్కతే పాపులర్ అయితే ఏంలాభం అనుకుందో ఏమో ఈ అమ్మడు తాజాగా తోడుగా చెల్లి ఐషాశర్మను కూడా తీసుకొస్తుంది.
ఆ భామ కూడా అక్కకు ధీటుగా అందాలు ఆరబోస్తుంది. ఈ సిస్టర్స్ హాట్ నెస్ తో గూగుల్ తల్లి వేడెక్కుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్ములకు సంబంధించిన హాట్ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి.