టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా సినిమాలు తక్కువ..సోషల్ మాద్యమాల పాపులారిటీ ఎక్కువ సంపాదించాడు. ఈ మద్య కొత్త ట్రెండ్ సృష్టిస్తూ..లఘు చిత్రాలపై కన్నెశాడు. ఈ నేపథ్యంలో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న వర్మ హాలీవుడ్ ఫోర్న్ బ్యూటీ మియా మాల్కావా తో ఓ సినిమా తీశారు. అయితే ఈ సినిమా పోస్టర్, టీజర్ రిలీజ్ చేసిన రోజు నుంచి వర్మ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు..కానీ మనోడు మాత్రం ఎక్కడా తగ్గకుండా..జనవరి 26 న రిలీజ్ చేస్తానని చెప్పాడు.
కానీ ఆ రోజు కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల మరుసటి రోజు రిలీజ్ చేశారు. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ’ అనుకున్న దానికన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించింది..ఎంతగా అంటే..అప్పట్లో ‘పద్మావతి’ కన్నా నా వీడీయోకే నెటిజన్లు ఎక్కువ మొగ్గు చూపారని వర్మ ట్విట్ చేశారు. ఇక ఈ సినిమా చర్చ సమయంలో తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఎట్టకేలకు శనివారం నాడు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు.
అయితే..కార్యాలయంలోకి వీరిద్దరిని తప్ప, మరెవరినీ లోపలకు అనుమతించకపోవడంతో వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇకపోతే..‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీని తెరకెక్కించడానికి గల కారణాలు.. చర్చావేదికపై మాట్లాడిన అంశాలను, అందుకు గల వీడియో ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం వాటికి అనుగుణంగా ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తామని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మీడియాకు వివరించారు.