మనీ: త్వరలోనే మహిళలకు ప్రతినెల రూ .2500..!!

Divya
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పిన ఆరు హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ తమ పాలనను కొనసాగుతోంది. ఇప్పటికే మహిళలకు సైతం ఉచిత బస్సు విషయాన్ని కూడా ప్రకటించింది.. వీటితో పాటు రైతుబంధు పథకం కూడా అమలు చేసింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా కూడా అందుకు తగ్గ సన్నహాలు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు చెప్పిన ఎలక్ట్రిక్ ఫ్రీ బైక్స్ ను కూడా అందించే విధంగా ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు.

అయితే 55 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు సైతం ప్రతినెల 2500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని అమలుపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పలు రకాల ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికలు ముందు సైతం కాంగ్రెస్ పార్టీ ఈ హామీని సైతం ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు సైతం ప్రభుత్వ పలు రకాల చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులను ఈ పథకానికి ఎంపిక చేయాలి అంటే తెల్ల రేషన్ కార్డు ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది.. అలాగే ఇంతవరకు ప్రభుత్వ పింఛన్  కూడ పొందని మహిళలకె  ఈ పథకం వర్తింప చేయాలన్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ వంటివి పొందని కుటుంబాలలోని మహిళలకు మాత్రమే రూ.2500 ఆర్థిక సహాయాన్ని సైతం అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని మహిళలకు సీఎం త్వరలోనే తీపి కబురు చేయబోతున్నట్లుగా తెలంగాణ రెవెన్యూ మంత్రి శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ పథకం గురించి చెబుతారని ఎవరు కూడా ఎలాంటి ఊహాగానాలను సైతం నమ్మవద్దండి అంటూ తెలియజేశారు. దీంతో తెలంగాణ మహిళలు సైతం ఈ పథకం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పథకం పైన సీఎం ఎప్పుడు స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: