మనీ: ప్రతి నెల రూ. 50 వేల పెన్షన్ పొందాలి అంటే ఇలా చేయండి..!!
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అనతికాలంలోనే మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. అంతేకాదు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలకు 50 వేలకు పైగా పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే.. ఒకవేళ మీ వయసు 30 సంవత్సరాలు అనుకుంటే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతినెల ఎన్ పి ఎస్ లో రూ.10 వేల చొప్పున నెలకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇక దీనిపై 10% రిటర్న్ కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత మొత్తం 2.53 కోట్ల రూపాయలు అవుతుంది. 40 శాతం యాన్యుటీ లో పెట్టుబడిగా పెడితే ఇక దానిని తీసివేసిన తర్వాత మీకు మొత్తం కోటిన్నర రూపాయలు చేతికి వస్తాయి . ఇక మిగతా డబ్బు ప్రతినెల 50 వేల రూపాయలు పెన్షన్ కింద పొందవచ్చు. దీంతో మీ వృద్ధాప్యంలో ఎలాంటి టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపచ్చు.