మనీ : వామ్మో ..రూ.లక్షకు రూ.90 లక్షలా..?
ఇప్పటికే షేర్ మార్కెట్లో ఎన్నో షేర్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. మరిముఖ్యంగా మల్టీ బ్యాగర్ షేర్లలో మనం కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కళ్లుచెదిరే రాబడి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వాటిలో హైదరాబాద్ కేంద్రంగా పలు సేవలు అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అయినటువంటి బ్రైట్ కమ్ గ్రూప్ షేర్ కూడా ఒకటి. ఈ షేర్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఆర్జించి పెట్టింది. అంతేకాదు గత మూడు సంవత్సరాల క్రిందట ఈ షేర్ లో డబ్బులు పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా 90 లక్షల రూపాయలు వచ్చాయట. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం..
ఇకపోతే గత మూడు సంవత్సరాల క్రితం ఈ షేరు ధర రూ.2.16 ఉండగా ప్రస్తుతం దీని ఒక్కొక్క షేర్ విలువ రూ.195 కు పెరిగింది. అంటే ఇందులో ఇన్వెస్టర్లకు తొమ్మిది వేల శాతం రాబడిని అందించింది అని చెప్పుకోవచ్చు. ఇక గత మూడు నెలల కాలంలోనే ఈ కంపెనీ యొక్క చేరు ఐదు కోట్లకు పైగా పెరగడం గమనార్హం. అంటే ఉదాహరణకు ఈ నీలో మీరు మూడు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం మీ ఇన్వెస్ట్మెంట్ ఏకంగా రూ.90 లక్షలకు పైగా ఉండేది.