జాతిరత్నాలు అనుదీప్, రవితేజ కాంబినేషన్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కామెడీ మెళవించిన స్టార్.. ఆయనకు జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ వీరిద్దరూ కలిస్తే థియేటర్లలో నవ్వులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిస్తే పొట్ట చెక్కలయ్యే లాగ నవ్వులు విరబూస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఇక అలాంటి ఒక నవ్వుల ప్రాజెక్టు సిద్ధమైందని తెలుస్తోంది.ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని సమాచారం.ఇటీవల రవితేజ కి దర్శకుడు అనుదీప్ కథని కూడా వినిపించారట. ఇక కథ విని ఇంప్రెస్ అయిన రవితేజ అనుదీప్ ప్రాజెక్టుకి ఓకే చెప్పారని తెలుస్తోంది. 

అంతేకాకుండా ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయిందని కూడా సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల కి స్కోప్ ఉందని అంటున్నారు. ఇక అందుకోసం తమన్నా త్రిష పేర్లు కూడా పరిశీలిస్తున్నారట. చిత్ర బృందం రవితేజ గతంలో తమన్నా త్రిషాలతో సినిమాలు చేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కి ఇద్దరు భామలు తోడైతే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు.

ఇంతే కాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా ఇటీవల రావణాసుర సినిమాతో మళ్ళీ పరాజయాన్ని చూశాడు. మళ్ళీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేస్తున్నాడు రవితేజ. బందిపోటు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో పాటు మరొక కొత్త దర్శకుడితో ఈగల్ అనే సినిమాని కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాల తర్వాత అనుదీప్ ప్రాజెక్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: