ఆ స్టార్ హీరో కిస్ చేస్తే అంత పని చేసిన కృతి శెట్టి..!?

Anilkumar
యంగ్ బ్యూటీగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది. మెఘా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అటు డైరెక్టర్ తో పాటు హీరో హీరోయిన్ల కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ స్టార్డం హీరో కాపాడుకోలేకపోయినప్పటికీ హీరోయిన్ మాత్రం కొనసాగిస్తోంది. బంగారు రాజు ,శ్యాం సింగరాయ్ వంటి సినిమాలలో నటించి సూపర్ హిట్ విజయాలను అందుకుంది. 

దాని అనంతరం మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ లుగా నిలిచాయి. దీంతో కృతి శెట్టి కెరియర్ బోల్తా పడింది. మొదటి సినిమాతోనే సినీ ఇండస్ట్రీని ఏలుతుంది అనుకున్నా ఈమె వరుసగా మూడు ప్లాపులు ఎదురవడంతో ఒక్కసారిగా తన క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి శెట్టి నాగచైతన్యతో కలిసి కసిరి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ప్రస్తుతం కృతి శెట్టి తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటు కోలీవుడ్ హీరో సూర్య అలాగే కార్తీక్ కలిసి మరో సినిమాలో కూడా నటిస్తోందట. ఇదిలా ఉంటే ఇక గతంలో హీరో ముద్దు పెట్టినందుకు కృత్రి శెట్టి తనను సబ్బుతో కొట్టినట్లుగా సమాచారం. ఇక ఆ హీరో మరెవరో కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్  తేజ్ వీరిద్దరూ జంటగా నటించిన ఉపన సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఆ సన్నివేశాల్లో నటించిన ప్రతిసారి కృతి శెట్టి పక్కకు వెళ్లి తన పెదవులను అలాగే తన ముఖాన్ని సబ్బుతో కడుక్కుంటుందట. ఆ విషయాన్ని గమనించిన వైష్ణవ తేజ్ చాలా బాధపడ్డాడట. దాని తర్వాత తనకి ఇన్ఫెక్షన్ ఉందని ఆ ఇన్ఫెక్షన్ కారణంగా తరచూ తన పెదాలని తన ముఖాన్ని సబ్బుతో కడుక్కుంటుందని విషయాన్ని తెలుసుకున్నాడు వైష్ణవ్ తేజ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: