నాగార్జున చేసిన తప్పువల్లే నాగచైతన్య సమంత విడిపోయారా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఎంతో అందమైన జంటగా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య మరియు సమంత. వీరిద్దరూ విడిపోవడం అక్కినేని కుటుంబాన్ని కాకుండా వారి అభిమానులను కూడా ఎంతోమందిని బాధించింది. అని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే వారిద్దరి అభిమానులకు ఇది ఎప్పటికీ మర్చిపోని బాధ .ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో నే వీరిద్దరూ విడిపోయిన అనంతరం వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని నీ కుటుంబం పెట్టిన కండిషన్లో కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. 

ఇంకొందరు మాత్రం వేరొక వ్యక్తితో సమంతకు ఎఫైర్ ఉంది అని ఆ విషయం తెలుసుకున్న నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చేసాడు అంటూ అప్పట్లో చాలామంది అన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున చేసిన ఒక తప్పు వల్ల వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు నాగార్జున మొదటి నుండి దేవుళ్లను, జాతకాలను పెద్దగా పట్టించుకోడు. కానీ పెళ్లి సమయంలో నాగ చైతన్య మరియు సమంత జాతకాలను పరిశీలించిన పండితులు అక్టోబర్ 6 2017న పెళ్లి చేయొద్దు అని చెప్పారట. కానీ నాగార్జున మాత్రం పండితుల మాటలను పట్టించుకోకుండా అదే రోజు వారి పెళ్లి నే చేశారట. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ముఖ్యమని..

 వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటే వారిద్దరిని ఎవరు ఏమీ చేయలేరు అని.. చెప్పాడంట నాగార్జున. కానీ మొదట పండితులు చెప్పిన విధంగానే వారిద్దరికీ జాతకాలు కలవలేదు అనంతరం అనేక సమస్యలు రావడం వల్ల విడాకుల వరకు వచ్చారని తెలుస్తోంది ఒకవేళ నాగార్జున పండితులు చెప్పినట్టుగా చేసి ఉంటే ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండేవారేమో అని అంటున్నారు ఈ వార్త విన్న నాగచైతన్య మరియు సమంత అభిమానులు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలామంది అక్కినేని మరియు సమంత నాగచైతన్య అభిమానులు నాగార్జున పై మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: