రెండో పెళ్లి గురించి మొదటి సారి సంచలన వ్యాఖ్యలు చేసిన మనోజ్..!?

Anilkumar
గత కొంతకాలంగా మంచు మనోజ్ మరికొద్ది రోజుల్లో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇది నిజమే అని తెలుస్తుంది. ఈయన మార్చి మూడవ తేదీన దిగవంత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి  కుమార్తె మౌనిక రెడ్డి తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తెలుస్తోంది. భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ రెండో పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్ల క్రితం వినాయక చవితి పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి వినాయకుడి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయి ఎంతగా చక్కర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అప్పటినుండి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరిద్దరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు వీరిద్దరి పెళ్లి మూడవ తేదీన జరగబోతుందని అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మనోజ్ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా అంటున్నారు. అంతేకాదు వీరిద్దరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా మనోజ్ భూమా మౌనికకు ఉన్నటువంటి రిలేషన్స్ గురించి మొదటిసారి స్పందించాడు. ఈ సందర్భంగా భూమా మౌనిక గురించి మనోజ్ మాట్లాడుతూ మొదట తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని అనంతరం అది ప్రేమగా మారిందని చెప్పుకొచ్చాడు.అంతేకాదు తన కష్ట సమయాల్లో భూమా మౌనికతో ఎంతో సన్నిహితంగా ఉన్నాడట.. తన కష్ట సమయాల్లో భూమ మౌనిక తనకి ఎంతో అండగా నిలిచిందని ఆమె తన జీవితంలోకి రావడం తన అదృష్టం అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్ తన రెండవ పెళ్లికి సంబంధించి మొదటిసారి భూమా మౌనిక గురించి మాట్లాడడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: