150 కోట్లు ఖర్చు చేసి అమెకోసం ఇంటిని కట్టించిన ధనుష్.. కానీ..!?

Anilkumar
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ధనుష్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని మాత్రం అసలు వదలడు ధనుష్ .ఇక అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలోనే తన డ్రీమ్ హౌస్ నీ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలను ఇటీవల నెరవేర్చుకున్నాడట ధనుష్.ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల క్రితం ధనుష్ అత్యంత ఖరీదైన మరియు విలాసాంతమైన ఇంటిని నిర్మించుకోవడం కోసం

 చెన్నైలోని  ఒక గార్డెన్ లో ఏకంగా 25 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడట. ఇందులో భాగంగానే గతేడాది ఈయన మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు కలిసి భూమి పూజను కూడా చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలతో ఈ విలాసవంతమైన ఇంటిని నిర్మించి తన భార్య పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఆ ఇంటిలో నివసించాలని అనుకున్నాడు ధనుష్. ఇక అనూహ్యంగా ఆ ఇంటిని నిర్మిస్తున్న సమయంలోనే కొన్ని కారణాలవల్ల ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. భార్యకి విడాకులు ఇచ్చినప్పటికీ తన డ్రీమ్ హౌస్ నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు ధనుష్ .ఇంటి నిర్మాణం అలానే కొనసాగిస్తూ వచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం ఇటీవల తన కొత్త ఇంట్లోకి తన కుటుంబ సభ్యులతో కలిసి ధనుష్ అడుగుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎంతో అందంగా అన్ని సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించాలని తెలుస్తోంది .తన డ్రీమ్ ఇంటిని 150 కోట్లకు పైగానే ఖర్చు చేసి కట్టించినట్లుగా తెలుస్తోంది. అన్ని కోట్లు ఖర్చు చేసి ఇంటిని కట్టించినప్పటికీ తన భార్య పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉండాలి అన్న కోరిక మాత్రం ధనుష్ తీర్చుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే తన భార్య పిల్లలతో కలిసి ఉండాలని ఆ ఇంటిని నిర్మించగా ఆ కోరిక తీరకపోవడంతో ఆ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: