"వీర సింహారెడ్డి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హనీ రోజ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక పాటలను ... అనేక పోస్టర్ లను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. వీర సింహా రెడ్డి మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.
 

ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: