పదేళ్ల తర్వాత తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. అంత సమయం ఎందుకు తీసుకున్నాడో తెలుసా..?

Anilkumar
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ విషయాన్ని మెగా హీరోలు అలాగే వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా వారి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు .ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషంగా ఉన్నారు .ఈ రోజు కోసం ఆయన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి .రామ్ చరణ్ ఉపాసన కి 2012లో  వివాహం జరిగింది. 

దాదాపు 10 ఏళ్లు పూర్తయిన తర్వాత వారి మొదటి సంతానం విషయంలో నిర్ణయం తీసుకున్నారు .ఇంత ఆలస్యంగా ఎందుకు వారు తల్లిదండ్రులు కావాలి అని అనుకున్నారు అనే విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే ముందుగా రాంచరణ్ అయితే తన భార్య కోరిక మేరకు నడుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడే ముందడుగు వేయాలని అనుకున్నారని తెలుస్తోంది. ఉపాసన తన ఫ్యామిలీ లైఫ్ లో రామ్ చరణ్ తో ఎక్కువగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుందట .

ఒకవైపు అపోలో బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు రాంచరణ్ తో ప్రేమ ప్రయాణం ఎంతో ఆనందంగా కొనసాగించింది. ఒక విధంగా పెళ్లయిన ఐదేళ్ల వరకు వారు పిల్లలను వద్దనుకున్నారు. పెళ్లి తర్వాత అపోలో ఉపాసన సహకారం అందించవలసి వచ్చింది. ఎప్పుడైతే ఆ బాధ్యతలను స్వీకరించిందో దానివల్ల మొదటి సంతానం విషయంలో ఇంత గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. గత రెండు మూడేళ్ల నుంచి ఈ విషయం గురించి ఇద్దరు చాలా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది .ఫైనల్ గా ఇప్పుడు అపోలోకు సంబంధించిన పనుల కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఉపాసన దీని కోసం రెడీ అయినట్లుగా సమాచారం. మెగా ఫ్యామిలీలో మూడవ తరానికి వారు నాంది పలకనున్నారు .ఇక ఈ సందర్భంగా అందరికంటే ఎక్కువగా వీరి అభిమానులు సంతోషిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: