మరో రెండు నెలల్లో పూరితో చిరు సినిమా.. నిజమెంత..?

Anilkumar
అవును నా ఆటో జానీ సంగతి ఏం చేశావు "అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా  మారిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ డైలాగ్ ను గాడ్ ఫాదర్ సినిమా ప్రచారాన్ని బాగా ఫాలో అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే పూరి జగన్నాద్ చిరంజీవి ఇంటర్వ్యూ ఆఖరిలో ఈ డైలాగ్ వినిపిస్తుంది. అయితే తనతో సినిమా చేయమని పూరి  చిరంజీవి అడిగాడట. దానికి మరో కథ సిద్ధం చేసి వస్తా అని ఆయన చెప్పాడట ఇప్పుడు ఆ కథ సిద్ధమైంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రెండు నెలల్లో షూటింగ్ కూడా మొదలు కానుంది అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. 

నమ్మడానికి కాస్త డౌట్ గానే ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త జోరుగా వినిపిస్తుంది. అయితే చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ కద సిద్ధం చేశాడని అప్పటికే ఆ ఆ కథను చిరంజీవికి వినిపించడంతో ఓకే కూడా చేశారని పూర్తిస్థాయిలో ఆ కథను సిద్ధం చేస్తే ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభిద్దాం అని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేస్తూ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు వాల్తేరు వీరయ్య,భోళా శంకర్ సినిమాలను

 ఒకేసారి షూట్ చేస్తున్నారు చిరంజీవి. ఇలా ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు భూల శంకర్ సెట్స్ మీద ఉండగా పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారట చిరంజీవి. అయితే ఫిబ్రవరిలో గనక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మొదలుపెడితే వినాయక చవితికి లేదా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని సాంగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. దీంతో ఈ సినిమా కోసం మీకు అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: