ఆ విషయంలో నిరాశ చెందుతున్న వెంకటేష్ - మోహన్ లాల్..!

Divya
థ్రిల్లర్ మూవీ గా మోహన్ లాల్ మలయాళం లో తెరకెక్కించిన సినిమా దృశ్యం. అక్కడ మంచి విజయం సాధించడంతో తెలుగులో 2014లో దృశ్యం సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ ప్రియ దర్శకత్వంలో రీమేక్ చేయబడ్డ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా దృశ్యం 2 కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు . ఎట్టకేలకు దాదాపు 7 సంవత్సరాల తర్వాత 2021 లో ఈ సినిమా రెండవ పార్ట్ నీ.. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేశారు. ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు మలయాళంలో మోహన్ లాల్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రెండవ భాగాన్ని కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేయడం జరిగింది.

ప్రస్తుతం తెలుగు,  మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్,  శ్రేయ కలిసి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా హిందీ దృశ్యం 2 సినిమాను థియేటర్లలో విడుదల చేయగా ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి రెస్పాన్స్ పొందుతోంది.  ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు వెంకటేష్ , ఇటు మోహన్ లాల్ ఇద్దరూ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీ లలో విడుదల చేసి ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయామని మనస్థాపం చెందుతున్నారు.

హిందీలో అభిషేక పతాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18 వ తేదీన థియేటర్లలో విడుదల చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఇందులో హీరోగా అజయ్ దేవగన్ , టబు,  అక్షయ కన్నా, శ్రేయ శరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న కలెక్షన్ ల తుఫాన్ ను  చూసి అటు మోహన్ లాల్ ఇటు వెంకటేష్ ఇద్దరూ నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: