వావ్: విజయ్ దేవరకొండ చేస్తున్న పనికి ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు..!!

Divya
టాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరు పొందిన విజయ్ దేవరకొండ తాజాగా తను సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటించగా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే కాకుండా విమర్శకుల పాలు కూడా అయ్యారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవలో తెరకెక్కించి విడుదల చేయగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ఇచ్చిన షాకులు విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ బ్యానర్ పై డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత కూడా నటిస్తోంది.

ఈ సినిమా మొత్తం ఎక్కువగా కాశ్మీర్ వంటి ప్రాంతాలలోనే చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇటీవల సమంత అనారోగ్య కారణం చేత ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పిస్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఒక ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ హాస్పిటల్ తో తనకున్న అనుబంధాన్ని తన కష్టకాలం గురించి వివరిస్తూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో తన తండ్రి అనారోగ్య పాలయ్యారని.. ఆ సమయంలో ఏ హాస్పిటల్ డాక్టర్లే వైద్యం అందించారని తెలియజేశారు.

ఇప్పుడు నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు ఈ కారణంగానే ఏ హాస్పిటల్ వారు ఆహ్వానించగానే వచ్చానని తెలిపారు. అంతేకాకుండా ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా తెలుసుకున్నారని అవయవ దానం వల్ల ఎంతోమందికి జీవితాలు కొత్త వెలుగును ఇస్తాయని అందుచేతనే తాను కూడా ఆర్గాన్ డొనేట్ చేశానని తెలిపి అక్కడున్న వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తన మరణాంతరం తన అవయవాల్ని దానం చేయడానికి ముందుకొచ్చానని తెలిపారు విజయ్ దేవరకొండ ఇలా చేయడం వల్ల ఇతరులు ఆనందంలో భాగం కావడం తనకి చాలా సంతోషమని తెలిపారు. దీంతో విజయ ఫ్యాన్స్ ఆయన పైన ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: