వావ్: విజయ్ దేవరకొండ చేస్తున్న పనికి ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు..!!
ఈ సినిమా మొత్తం ఎక్కువగా కాశ్మీర్ వంటి ప్రాంతాలలోనే చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇటీవల సమంత అనారోగ్య కారణం చేత ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పిస్ హాస్పిటల్ వారు నిర్వహించిన ఒక ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ హాస్పిటల్ తో తనకున్న అనుబంధాన్ని తన కష్టకాలం గురించి వివరిస్తూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో తన తండ్రి అనారోగ్య పాలయ్యారని.. ఆ సమయంలో ఏ హాస్పిటల్ డాక్టర్లే వైద్యం అందించారని తెలియజేశారు.
ఇప్పుడు నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు ఈ కారణంగానే ఏ హాస్పిటల్ వారు ఆహ్వానించగానే వచ్చానని తెలిపారు. అంతేకాకుండా ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా తెలుసుకున్నారని అవయవ దానం వల్ల ఎంతోమందికి జీవితాలు కొత్త వెలుగును ఇస్తాయని అందుచేతనే తాను కూడా ఆర్గాన్ డొనేట్ చేశానని తెలిపి అక్కడున్న వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తన మరణాంతరం తన అవయవాల్ని దానం చేయడానికి ముందుకొచ్చానని తెలిపారు విజయ్ దేవరకొండ ఇలా చేయడం వల్ల ఇతరులు ఆనందంలో భాగం కావడం తనకి చాలా సంతోషమని తెలిపారు. దీంతో విజయ ఫ్యాన్స్ ఆయన పైన ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.