బాలయ్య తో క్లాస్ డైరెక్టర్ సినిమా!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందే సినిమాల జాబితా రోజురోజుకు ఎక్కువగా అవుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వీర సింహా రెడ్డి అనే సినిమాను చేస్తున్నాడు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా చేయడం వాళ్ళందరినీ ఎంతగానో సంతోష పెట్టింది.

వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టడం జరుగుతుందని వార్త ఇప్పుడు హల్సల్ అవుతుంది. అనిల్ రావిపూడి సినిమాలు చేయడం లో ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరగదు. చక చక సినిమాలను చేసి విడుదల చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమాల జాబితా చాలానే ఉంది. ఇద్దరు ముగ్గురు యువ దర్శకులు ఆయనతో కథలు చెప్పడం జరిగింది.

దాంతో ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి బాల కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు రావడంతో వెంటనే ఆయనతో సినిమా చేసే దర్శకుడుగా పరుశురాం పేరు ఎక్కువగా వినబడుతుంది. పరశురామ్ కు గీతా ఆర్ట్స్ కు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథ ను తయారు చేస్తే తప్పకుండా ఆ సినిమా పరశురామ్ తోనే అవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల తరువాత నందమూరి బాలకృష్ణ ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడవలసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: