ఇటీవల విడుదలైన లైగర్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అనన్య పాండే. అంతేకాదు మరోవైపు తన పిచ్చెక్కించే హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషనల్ స్టార్గా నిలిచింది.అయితే ఇప్పుడు లవ్ ఎఫైర్ రూమర్స్ విషయంలోనూ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.ఇక ఇప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పింది అనన్య పాండే. కాగా ఇషాన్ ఖట్టర్తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది.ఇక ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.అంతేకాదు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలారు. ఇక ఆయనకు ఆ మధ్య బ్రేకప్ చెప్పింది.
అయితే తాను ఇప్పుడు సింగిల్ అని ఇషాన్ ఆ మధ్య కరణ్ టాక్ షోలో తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఇంతలోనే మరో యంగ్ బాలీవుడ్ హీరోతో కనిపించి షాకిచ్చింది. ఇక బాలీవుడ్ నిర్మాత మనీష్ మల్హోత్రా దివాళీ బాష్ పార్టీ ఇచ్చారు.కాగా ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు. ఈ నైట్ పార్టీ కోసం అనన్య పాండే బాలీవుడ్ యంగ్ హీరో అదిత్య రాయ్ కపూర్తో కలిసి రావడం విశేషం.ఇక ఆదిత్య రాయ్, అనన్య పాండే కలిసి కెమెరాకి పోజులిచ్చారు. ఫోటో షూట్ కి ఆదిత్య ముందు రాగా, ఇంకా రావడం లేదంటూ ఆదిత్య ఆమెని పిలిచాడు.
ఇక దీంతో ఆయనతో కలిసి చేరింది.... కలిసే ఫోటోలకు పోజులిచ్చింది.అయితే ఈ సందర్భంగా వీరిద్దరు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు.ఇక ఫోటో సెషన్ అనంతరం ఇద్దరు కలిసి లోపలికి వెళ్లిపోయారు. అందులో వీరిద్దరు చాలా చనువుగా మూవ్ అవ్వడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి.అంతేకాదు కొత్త లవ్ కపుల్ అంటూ బాలీవుడ్ మీడియా గాసిప్లు స్టార్ట్ చేసింది.ఇక ప్రస్తుతానికి ఈ జంట లవ్ బిగినింగ్ స్టేజ్లోనే ఉందని, మున్ముందు అది బలపడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా రాసుకొస్తుంది. ఇక దీంతో ప్రస్తుతం `లైగర్` బ్యూటీ డేటింగ్ రూమర్స్ ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి.దీనిపై అటు ఆదిత్య గానీ, ఇటు అనన్య గానీ స్పందించలేదు. ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది..!!