బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొనే ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా దీపికా పదుకొనే వరస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తేరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ మూవీ తో పాటు షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ మూవీ లో కూడా దీపికా పదుకొనే , షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్న దీపికా పదుకొన్ కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన రన్వీర్ సింగ్ ను పెళ్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అయినటు వంటి రన్వీర్ సింగ్ , దీపికా పదుకొనే లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి.
ఇది ఎలా ఉంటే తాజాగా ఈ వార్తలపై దీపికా పదుకొనే స్పందించింది. తాజాగా దీపికా పదుకొన్ ... మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. గతవారం రన్వీర్ సింగ్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నాడు. తిరిగి రాగానే నన్ను చూసి పట్టలేనంత సంతోషాన్ని చూపించాడు అని తాజాగా దీపికా పదుకొన్ చెప్పుకొచ్చింది.