మరో క్రేజీ మూవీ లో ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన కృతి శెట్టి మొదటి మూవీ లోనే తన అందమైన నటనతో ,  అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఉప్పెన మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ నటించిన అనేక తెలుగు సినిమాలు విడుదల కూడా అయ్యాయి.

అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా ,  మరి కొన్ని మూవీ లు అపజయాలను సాధించాయి. ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కృతి శెట్టి వరస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా కృతి శెట్టి కి ప్రస్తుతం తమిళ ,  మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఆఫర్ లు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు లో నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి , సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఒక తమిళ మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన టోవినో థామస్ హీరోగా తెరకెక్కనున్న "అజయంతే రాండమ్ మోషణం" అనే మూవీ లో ఈ ముద్దుగుమ్మ అవకాశాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: